Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద 125 గంటల పాటు సజీవంగా ఉన్న 2 నెలల చిన్నారి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (14:43 IST)
టర్కీ, సిరియా దేశాల్లో మారణహోమం సృష్టించిన వరుస భూకంపాలు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ భూకంపం ధాటికి కూలిపోయిన శిథిలాల నుంచి తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 28 వేల మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మరణాల్లో టర్కీలో 25 వేల మంది, సిరియాలో 3500 మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భూకంపం సంభించి రోజులు గడిచిపోతున్నప్పటి కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉడటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. 
 
హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కింద చిక్కుకున్న రెండేళు నెలల చిన్నారిని సహాయ బృందాలు ప్రాణాలతో వెలికి తీశారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. 
 
టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజుల కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments