Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 21న ఇండియాకు ట్రంప్!

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:23 IST)
అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ మన దేశ పర్యటన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో ఆయన మన దేశంలో టూర్​ చేస్తారని సమాచారం. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ట్రంప్ బహిరంగ సభలోపాల్గొంటారని తెలిసింది.

ఈ సభ అహ్మదాబాద్లో ఉండే అవకాశముందని చెబుతున్నా.. దీనిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్​లో ఇప్పటికే ఆయన కోసం సూట్​ బుక్​ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు క్లింటన్​, ఒబామా కూడా ఇదే హోటల్​లో బస చేశారు.

వచ్చే నెల 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలోని యూఎన్​ హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్​ వేదికగా మనదేశాన్ని బద్నామ్ చేయడానికి పాకిస్తాన్ ​రెడీ అవుతున్న సమయంలో ట్రంప్ టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్నార్సీ, ఎన్​పీఆర్​తో పాటు మోడీ పాలనలో ముస్లింలకు సెక్యూరిటీ లేదని వాదనలను కూడా పాకిస్తాన్​  కౌన్సిల్​ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని మన అధికారులు కొందరు చెప్పారు.
 
చర్చించే అంశాలివీ.......
ట్రంప్ టూర్​లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్​, ఆఫ్గనిస్తాన్​, ఇరాన్​, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments