Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 21న ఇండియాకు ట్రంప్!

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:23 IST)
అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ మన దేశ పర్యటన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో ఆయన మన దేశంలో టూర్​ చేస్తారని సమాచారం. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ట్రంప్ బహిరంగ సభలోపాల్గొంటారని తెలిసింది.

ఈ సభ అహ్మదాబాద్లో ఉండే అవకాశముందని చెబుతున్నా.. దీనిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్​లో ఇప్పటికే ఆయన కోసం సూట్​ బుక్​ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు క్లింటన్​, ఒబామా కూడా ఇదే హోటల్​లో బస చేశారు.

వచ్చే నెల 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలోని యూఎన్​ హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్​ వేదికగా మనదేశాన్ని బద్నామ్ చేయడానికి పాకిస్తాన్ ​రెడీ అవుతున్న సమయంలో ట్రంప్ టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్నార్సీ, ఎన్​పీఆర్​తో పాటు మోడీ పాలనలో ముస్లింలకు సెక్యూరిటీ లేదని వాదనలను కూడా పాకిస్తాన్​  కౌన్సిల్​ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని మన అధికారులు కొందరు చెప్పారు.
 
చర్చించే అంశాలివీ.......
ట్రంప్ టూర్​లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్​, ఆఫ్గనిస్తాన్​, ఇరాన్​, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments