Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బెబ్బే... భారత్‌తో యుద్ధం వద్దు.. శాంతిని కోరుకుంటున్నాం.. పాకిస్థాన్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (06:57 IST)
శత్రుదేశం పాకిస్థాన్ శాంతిమంత్రం జపించింది. ఓవైపు పక్కలో బల్లెంలా తయారై ఉగ్రమూకలను రెచ్చగొడుతూనే మరోవైపు శాంతిమంత్రి పఠిస్తోంది. రావల్పిండిలో జరిగిన వైమానిక దళానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా మాట్లాడుతూ, తమది శాంతిని కోరుకునే దేశమన్నారు.
 
ముఖ్యంగా, భారతదేశంలో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి సాగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. అన్ని దేశాలకు స్నేహ హస్తాన్ని చాచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తన ప్రకటనలకు పెడార్థాలు తీయవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దేశ అభివృద్ధిని కోరుకుంటోందని చెప్పారు. కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కయ్యాలకు కాలు దువ్వడం కంటే, పరస్పర గౌరవానికే పాకిస్థాన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments