Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాక్టీరియా సోకిన చేపను తిని కాళ్ళుచేతులు పోగొట్టుకున్న మహిళ...

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (13:41 IST)
అమెరికాలోఓ విషాదకర ఘటన జరిగింది. బ్యాక్టీరియా సోకిన చేపను ఆరగించిన ఓ మహిళ కాళ్లు, చేతులు పోయాయి. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 40 ఏళ్ల లారా బరాజాస్‌ అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన టిలపియా చేప తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారని లారా స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు వెల్లడించారు. 
 
'ఆమె ప్రాణాలు పోయినంతపనైంది. కొంతకాలం పాటు ఆమె రెస్పిరేటర్‌పై ఉంది. డాక్టర్లు ఆమెను వైద్యపరమైన కోమాలో ఉంచారు. ఆమె కింది పెదవి, వేళ్లు, పాదాలు నల్లగా మారాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింది. శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ ఘటన మాపై ఎంతో ప్రభావం చూపింది. ఇది మాకు భయానక అనుభవం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు' అని మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.
 
లారా కొద్దికాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత.. గత వారం ఆమెకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాలు కాపాడేక్రమంలో వైద్యులు ఆమె కాళ్లూచేతులు తొలగించారు. ఈ ఘటన సముద్ర ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అవసరాన్ని నొక్కి చెప్తోందని నిపుణులు హెచ్చరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments