Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ జాబితా: నలుగురు భారతీయ మహిళలకు చోటు!

Webdunia
బుధవారం, 27 మే 2015 (18:40 IST)
ఫోర్బ్స్ ప్రకటించిన '100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో నలుగురు భారతీయ మహిళలు స్థానం సంపాదించుకున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తొలిస్థానంలో నిలిచిన ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చంద కొచ్చర్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ టీ మీడియా చైర్ పర్సన్ శోభనా భార్తియాలకు చోటు దక్కింది. 
 
అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో, చంద కొచ్చర్ 35, కిరణ్ మజుందార్ షా 85, శోభనా భార్తియా 93వ స్థానాల్లో నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే అరుంధతీ భట్టాచార్య ఆరు స్థానాలు, కొచ్చర్ 8 స్థానాలు, మజుందార్ షా 7 స్థానాలు ఎగబాకారు. వీరితో పాటు భారత సంతతికి చెందిన మరో ఇద్దరూ జాబితాలో స్థానం సంపాదించారు. పెప్సీకో చీఫ్ ఇంద్ర నూయి, సిస్కో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్‌లకు స్థానం దక్కింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments