Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కొత్త కరోనాతో అత్యధిక స్థాయిలో మరణాలు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (10:34 IST)
కొత్త కరోనా వైరస్‌తో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించవచ్చునని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత ఇంగ్లాండ్‌లో బయటపడ్డ ఈ వైరస్‌..అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీంటికీ పాకిన సంగతి తెలిసిందే.

పాత వైరస్‌తో పోల్చుకుంటే కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ వేగంగా వ్యాపించగలదని అధ్యయనాలు చెప్పాయి. దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో జాన్సన్‌ మాట్లాడుతూ .మరణాలు మరింత ఎక్కువ సంభవించవచ్చునని హెచ్చరించారు. కాగా, దానికి బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ఆట్రిక్‌ వాలెన్స్‌ ఉదహరించారు.

దేశంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వెయ్యిమందిలో 10 మందిలో పాత వైరస్‌ కారణంగా చనిపోతే...కొత్త కరోనా వైరస్‌ కారణంగా 13 నుండి 14 మంది బలౌతున్నారని తెలిపారు. అంటే గత వైరస్‌ మరణాలతో పోలిస్తే 30 శాతం అదనమని అన్నారు.

అయితే ఈ వైరస్‌తో ఎందుకు ఎక్కువ మరణాలకు సంభవిస్తున్నాయో ఆయన వివరించలేదు. అయితే ఈ కొత్త కరోనా వైరస్‌ కారణంగానే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెప్పేందుకు సరైన నిర్ధారణ లేదని ప్రజారోగ్య సిబ్బంది పేర్కొనగా...తాజా ప్రాథమిక గణాంకాలు ఆందోళనలు పెంచుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments