Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో సైనిక చెక్ పోస్టుపై ఉగ్రవాదుల దాడి

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (23:23 IST)
పాకిస్థాన్ దేశంలోని సైనిక చెక్ పోస్టుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. గిరిజన జిల్లా అయిన నార్త్ వజిరిస్థాన్ లోని హసన్ ఖేల్ ఏరియా బేజా సైనిక చెక్ పోస్టుపై గుర్తుతెలియని ఉగ్రవాదులు దాడి చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ సైనిక చెక్ పోస్టుపై జరిగిన ఉగ్ర దాడిలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డారు. గాయపడిన పాక్ జవాన్ ను ద్వాటోయి ప్రాంత ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాడి చేశారు.
 
దీంతో పాక్ అదనపు సైనిక బలగాలను చెక్ పోస్టులో మోహరించింది.గత వారం ఆఫ్ఘాన్ వైపు నుంచి ఉగ్రవాదులు మిలటరీ పోస్టుపై కాల్పులు జరిపారు. వారంరోజుల నాటి కాల్పుల ఘటనలో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పాకిస్థాన్ దేశానికి 2,600 కిలోమీటర్ల మేర ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ఉండటంతో ఉగ్రదాడులు తరచూ జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments