Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాసా' పోటీల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (17:47 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల్లో ముఖ్యంగా మహిళలు తమ సత్తా చాటారు. చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా ఈ పోటీలను నాసా నిర్వహించింది. ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన బృందం సత్తా చాటింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు బృందం టాప్‌-10లో నిలిచి 25 వేల డాలర్లు (సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా ‘నాసా’ గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది. 
 
‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ చాలెంజ్‌’ పేరుతో చేపట్టిన పోటీలకు ఔత్సాహిక పరిశోధకుల నుంచి ప్రాజెక్ట్‌లను ఆహ్వానించింది. దీంతో వెయ్యికిపైగా ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 48 దేశాలకు చెందిన 374 ప్రాజెక్టులను పోటీలకు ఎంపిక చేసింది. 
 
రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్‌, అమరేశ్వర ప్రసాద్‌ చుండూరు, ప్రణవ్‌ ప్రసాద్‌ రూపొందించిన ఎల్‌-వాటర్‌(లూనార్‌ వాట ర్‌ అబ్‌స్ట్రాక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బై ఎక్సకవేషన్‌ ఆఫ్‌ రెగోలిత్‌) ప్రాజెక్ట్‌ టాప్‌-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments