Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్‌ దేశాలు విమానాల ఆపివేత.. ప్రవాస భారతీయులకు తలనొప్పి

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:04 IST)
గల్ఫ్ దేశాలు కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి కారణంగా ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను మూసివేస్తున్నాయి. ఇంకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నాయి. వారం రోజుల వరకూ తమ దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్టు సౌదీ అరేబియా, ఒమాన్‌ ప్రకటించగా.. పది రోజుల పాటు సరిహద్దులను మూసివేస్తున్నట్లు కువైత్‌ వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆ దేశాల నుంచి ఎయిరిండియా విమానాలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్‌ మొహమ్మద్‌ ఫయాజ్‌ తెలిపారు. దీంతో గల్ఫ్‌ దేశాల నుంచి మాతృదేశానికి వెళ్లలేక పలువురు ప్రవాస భారతీయులు, తెలుగువారు చిక్కుకుపోయారు.
 
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి సౌదీ అరేబియా, కువైత్‌ దేశాలు భారత్‌ నుండి నేరుగా విమానాలను అనుమతించట్లేదు, ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఈ దేశాల నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నప్పటికీ.. భారత్‌ నుంచి నేరుగా రావడం పై మాత్రం నిషేధం ఉంది. దీంతో సౌదీ మరియు కువైత్‌ దేశాలకు రావాలనుకుంటున్న తెలుగువారు 14 రోజులు దుబాయి లేదా మస్కట్‌లో గడిపి అక్కడి నుండి వస్తున్నారు. 
 
ఈ  క్రమంలోనే.. హైదరాబాద్‌, చెన్నై నుంచి దుబాయికి చేరుకుని, 14 రోజులు గడిపిన వందలాది మంది తెలుగువారు.. కువైత్‌, సౌదీ అరేబియాకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా సౌదీ, కువైత్‌ నిర్ణయాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments