దోషుల కాళ్లు - చేతులు నరికేస్తాం : తాలిబన్ తీవ్రవాదులు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (13:34 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులకు తమ పాత జులుంను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. వివిధ నేరాలకు పాల్పడి దోషులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేందు సిద్ధమయ్యారు. ముఖ్యంగా, నేరం చేసిన దోషుల కాళ్లు, చేతులు నరికేస్తామని ప్రకటించారు. 1990ల నాటిలాగే ఆఫ్ఘ‌న్‌లో ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబ‌న్లు తేల్చి చెబుతున్నారు.
 
తాలిబన్‌ వ్యవస్థాపక స‌భ్యుడు ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. త‌మ దేశ‌ అంతర్గత వ్యవహారాల్లో ఇత‌రులు జోక్యం చేసుకునే అవ‌స‌రం లేద‌ని చెప్పారు. త‌మ‌ చట్టాలు ఎలా ఉండాలనే విష‌యం వారు చెప్పకూడ‌ద‌న్నారు. తాము ఇస్లాంను అనుసరిస్తామ‌ని, ఖురాన్‌ ప్రకారమే చట్టాలు రూపొందించుకుంటామ‌ని, ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. 
 
ముఖ్యంగా, రెండు దశాబ్దాల క్రితం తాము ఆఫ్ఘ‌న్‌లో జ‌రిపిన ప‌రిపాలన తరహాలోనే ఇప్పుడు కూడా త‌మ దేశంలో దోషులకు కఠిన శిక్ష‌లు విధిస్తామ‌ని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఆ శిక్ష‌ల‌ను బహిరంగంగా అమలు చేయాలా? అన్న దానిపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments