Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధి... కాశ్మీర్ సమస్యకు తాలిబన్ల సాయం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:12 IST)
పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాలిబన్ల సాయం తీసుకుంటామని ఆ దేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 
టీవీ చర్చలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారని నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి. పీటీఐ అధికార ప్రతినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే అప్రమత్తమైన చానెల్ న్యూస్ యాంకర్‌.
 
ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారతీయులు కూడా వీక్షిస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా.. మీరేం చెప్పారో మీకు అర్థం అవుతుందా అని నీలం ఇర్షాద్ షేక్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కానీ అతడు ఇవేవి పట్టించుకోకుండా.. ''తాలిబన్లు మాకు సాయం చేస్తారు.. ఎందుకంటే వారిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు'' అంటూ కొనసాగించాడు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments