Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అలా చేస్తే చూస్తూ ఊరుకోం.. తాలిబన్లు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (13:20 IST)
తాలిబ‌న్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘ‌న్ ప్రాంతాల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకుంది. కాబూల్ మిన‌హా మిగ‌తా భూభాగాల‌ను ఇప్ప‌టికే తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబ‌న్‌, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వాల మ‌ధ్య సంధికి ఖ‌తార్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అధికారాన్ని తాలిబ‌న్ల‌తో క‌లిసి పంచుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది.
 
ఇక, తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని తాము గుర్తించ‌బోమ‌ని ఇండియాతో స‌హా 12 దేశాలు స్ప‌ష్టం చేశాయి. ఇదిలా ఉంటే, తాలిబ‌న్ నేత‌లు ఇండియాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆఫ్ఘ‌న్ అభివృద్ధి కోసం భార‌త ప్ర‌భుత్వం చాలా స‌హాయం చేసింద‌ని, దేశంలో రోడ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణం, జాతీయ ప్రాజెక్టుల‌ను నిర్మించిందని నేత‌లు పేర్కొన్నారు.
 
దేశ‌ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ భార‌త్‌కు రుణ‌ప‌డి ఉంటార‌ని, కానీ, త‌మ‌కు వ్య‌తిరేకంగా మిలిట‌రీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త్ భావిస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని తాలిబ‌న్ నేత‌లు హెచ్చ‌రించారు. తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా భార‌త్‌తో మిత్రుత్వాన్ని కోరుకుంటుంద‌ని, శ‌తృవుగా చూడ‌ద‌ని తాలిబ‌న్ నేత‌లు స్ప‌ష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments