డబ్బు కోసం ఆరేళ్ల కుమార్తెను విక్రయించి పెళ్లి జరిపించిన తండ్రి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 జులై 2025 (09:31 IST)
తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. డబ్బు కోసం ఆరేళ్ల బాలికను ఓ కసాయి తండ్రి.. ఓ వ్యక్తికి విక్రయించి, వివాహం కూడా జరిపించాడు. తాజాగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆప్ఘనిస్థాన్‌లోని మర్జా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
వివరాలను పరిశీలిస్తే, మర్జా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పేదరికం కారణంగా తన ఆరేళ్ల కుమార్తెను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలున్న ఆ వ్యక్తి, బాలిక కుటుంబానికి కొంత డబ్బు చెల్లించి ఈ పెళ్లికి ఒప్పించినట్లు అమెరికాకు చెందిన అము.టీవీ అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది. 
 
ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి పెను దుమారం రేపుతున్నాయి. చిన్నారి పక్కన కూర్చున్న మధ్య వయస్కుడైన వరుడిని చూసి నెటిజన్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక తాలిబన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే, ఈ అధికారుల తీరు మరింత విడ్డూరంగా ఉంది. వారు ఆ వ్యక్తి, బాలికను తన ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, బాలికకు తొమ్మిదేళ్ల తర్వాత భర్త ఇంటికి పంపవచ్చని వారు చెప్పినట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments