Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృత్తి నిపుణులకు తాలిబన్ల వేడికోలు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:20 IST)
దేశం విడిచి వెళ్లిపోవద్దని నిపుణులైన ఆఫ్ఘన్లను తాలిబన్‌ వేడుకుంది. ఇంజనీర్లు, డాక్టర్లు వంటి ఆఫ్ఘన్‌ వృత్తి నిపుణులను కాబూల్‌ నుండి తీసుకెళ్ళడాన్ని ఆపాలని అమెరికాను కోరింది.

మరోవైపు గడువులోగా తరలింపును పూర్తి చేయాల్సి వున్న అమెరికా బలగాలు పలువురు ఆఫ్ఘన్లతో సహా వేలాదిమందిని అక్కడ నుండి తరలిస్తున్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వస్తున్న ఆఫ్ఘన్ల కోసం ఇప్పటికే మూడు మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేసిన అమెరికా 4వ స్థావరాన్ని న్యూ జెర్సీలో ఏర్పాటు చేసినట్లు పెంటగన్‌ తెలిపింది.

ఇప్పటివరకు మొత్తంగా 58 వేల మందికి పైగా తరలించడానికి అమెరికా చర్యలు తీసుకుంది. 'ఈ దేశానికి వారి నైపుణ్యాలు అవసరం. వారిని ఇతర దేశాలకు తీసుకెళ్ళొద్దు' అని తాలిబన్‌ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ మీడియా సమావేశంలో వేడుకున్నారు.

'అమెరికా, నాటో బలగాలకు విమానాలు వున్నాయి. విమానాశ్రయం వుంది. ఇక్కడ నుండి వారి పౌరులను, కాంట్రాక్టర్లను మాత్రమే తీసుకెళ్ళాలి' అని ముజాహిద్‌ పేర్కొన్నారు. విదేశీ బలగాల ఉప సంహరణకు ప్రస్తుతమున్న ఆగస్టు 31 గడువును పొడిగించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments