Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ బాంబర్లు నిజమైన హీరోలు : ఆప్ఘన్ హోం శాఖామంత్రి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (09:00 IST)
తమ ఉన్మాద చర్యలతో అనేక మంది ప్రాణాలు బలితీసుకుంటున్న సూసైడ్ బాంబర్లను ఆప్ఘనిస్థాన్ దేశ పాలకులు నిజమైన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. పైగా, సూసైడ్ బాంబర్లపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు. 
 
ఈ మధ్యకాలంలో ఆ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్నారు. ఆ దేశంలో జరుగతున్న సూసైడ్ దాడులతో పలువురు సూసైడ్ బాంబర్లు పాల్గొంటున్నారు. వీరిపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సూసైడ్ బాంబర్లు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 10,000 ఆఫ్ఘానీలు (125 డాలర్లు), ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్టు స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
 
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments