Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌ టూర్ సక్సెస్.. కీలక ఒప్పందాలు కుదిరాయ్!: సుష్మ

Webdunia
సోమవారం, 28 జులై 2014 (11:47 IST)
నేపాల్‌లో తన మూడు రోజుల పర్యటన విజయవంతం అయిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభివర్ణించారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. 
 
విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఖరారైందని, అలాగే 1950లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా వాస్తవానుగుణంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు స్వదేశానికి బయలుదేరే ముందు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేర్కొన్నారు. 
 
అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని, ఈ దిశగా ఎలాంటి అవరోధాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలనీ సంకల్పించినట్లు ఆమె వెల్లడించారు. 
 
ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాలతో సుష్మా స్వరాజ్ సమావేశమయ్యారు. అలాగే నేపాల్ మావోయిస్టు నాయకుడు ప్రచండతో కూడా మంతనాలు జరిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments