Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఎపుడైనా ఆచరణాత్మక చర్చలకు రావాల్సిందే : నవాజ్ షరీఫ్

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (10:06 IST)
భారత్ ఏదో ఒక రోజున ఆచరణాత్మక చర్చలకు రావాల్సిందేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం పాక్ తిరిగి వెళుతూ, లండన్‌లో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో ఒకసారి వాస్తవిక, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనలతో భారత్‌ మాతో చర్చలకు రావాల్సిందే. పాకిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద దాడులలో భారత్‌ పాత్ర ఉంది. ఇందుకు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇటువంటి పరోక్ష యుద్ధం వల్ల ఇరుదేశాలకూ ప్రయోజనం లేదు. 70 ఏళ్లుగా మన మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోయేలా మంచి సూచనలతో భారత్‌ మా వద్దకు రావాలి అని పిలుపునిచ్చారు. 
 
తమతో భారత్ నిత్యమూ పరోక్ష యుద్ధం చేస్తున్నదని వ్యాఖ్యానించిన ఆయన ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని హితవు పలికారు. తాము చర్చలకు రావాలని పిలుపునిస్తున్నా, భారత్ స్పందించడం లేదని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం నాలుగు సూత్రాలను తాము ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. సియాచిన్‌లో మోహరించిన భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments