Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (11:50 IST)
పాకిస్థాన్ టెర్రరిస్టులు భారత సైన్యానికి పెనుసవాల్‌గా మారింది. జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టింది. రాష్ట్రంలోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాల్పుల అనంతరం అక్కడ సోదాలు నిర్వహించిన భారత సైన్యానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందు సామగ్రి దొరికింది. పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభించిన నేపథ్యంలో మరింత మంది ఉగ్రవాదులు చొచ్చుకొచ్చి ఉంటారన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెర్రరిస్టులు జవాన్లపై కాల్పులు జరపడంతో.. సైన్యం కూడా ప్రతి కాల్పులు జరపాల్సి వచ్చింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments