Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైలులోకి పాము ఎలా వచ్చింది... ప్రయాణం 17 నిమిషాలు ఆలస్యం!!

వరుణ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:10 IST)
ప్రపంచంలో జపాన్ బుల్లెట్ రైళ్లకు ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. వేగానికి మారు పేరుగా ఈ రైళ్లను చెబుతారు. అలాంటి రైలులో పాము చేరిపోయింది. ఈ కారణంగా ఆ రైలు ప్రయాణం 17 నిమిషాల పాటు ఆలస్యమైంది. సాధారణంగా పాము వల్ల రైలు ప్రయాణం ఆలస్యం కావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటన ఇపుడు జపాన్ నగరంలో చోటుచేసుకుంది. 
 
రైలులో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ బోగీలోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించి గమ్యస్థానానికి చేర్చారు. అయితే, ఆ బుల్లెట్ రైలులోకి ఆ పాము ఎలా వచ్చిందన్నది తెలియలేదు. అలాగే, ఆ పాము కూడా విషపూరితమా కాదా అన్నది కూడా తెలియరాలేదు. 
 
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments