Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైలులోకి పాము ఎలా వచ్చింది... ప్రయాణం 17 నిమిషాలు ఆలస్యం!!

వరుణ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:10 IST)
ప్రపంచంలో జపాన్ బుల్లెట్ రైళ్లకు ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. వేగానికి మారు పేరుగా ఈ రైళ్లను చెబుతారు. అలాంటి రైలులో పాము చేరిపోయింది. ఈ కారణంగా ఆ రైలు ప్రయాణం 17 నిమిషాల పాటు ఆలస్యమైంది. సాధారణంగా పాము వల్ల రైలు ప్రయాణం ఆలస్యం కావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటన ఇపుడు జపాన్ నగరంలో చోటుచేసుకుంది. 
 
రైలులో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ బోగీలోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించి గమ్యస్థానానికి చేర్చారు. అయితే, ఆ బుల్లెట్ రైలులోకి ఆ పాము ఎలా వచ్చిందన్నది తెలియలేదు. అలాగే, ఆ పాము కూడా విషపూరితమా కాదా అన్నది కూడా తెలియరాలేదు. 
 
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments