Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా సొమ్ముకోసం ప్రాణహానికి పాల్పడిన మహిళ

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:31 IST)
ఇన్సూరెన్స్ డబ్పులు కోసం సొంత వాళ్లకి హాని కలిగించడం లేదా ఏకంగా ప్రాణాలు తీసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాగే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ మహిళ తనను సైతం గాయపరుచుకుంది. బీమా కంపెనీ నుండి భారీగా డబ్బు గుంజేయాలనే ఉద్దేశంతో ఈ పని చేసింది. ఈ ఘటన స్లోవేనియా దేశంలో చోటుచేసుకుంది. 
 
స్లోవేనియా రాజధాని నగరం జుబుల్‌జానాలో నివాసం ఉంటున్న ఓ 21 ఏళ్ల మహిళ ప్రమాద బీమా పాలసీ తీసుకుంది. దీని ప్రకారం పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే నెలవారీ ఖర్చుల నిమిత్తం 3 వేల పౌండ్లు (2.75 లక్షలు పైగా) దానితోపాటు ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు లక్షల పౌండ్లు (దాదాపు 3 కోట్లు 14 లక్షల రూపాయలు) సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
 
ఈ సొమ్ము కోసం కుటుంబ సభ్యులతో కలసి ప్రణాళిక సిద్ధం చేసింది. చేతికి గాయమైందంటూ ఆసుపత్రిలో చేరింది. ఇంటి దగ్గర తోటపని చేస్తుండగా ప్రమాదవశాత్తూ గాయమైందని వైద్యులకు తెలిపారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం దీనిపై అనుమానం వచ్చింది. వారి స్వంత వ్యక్తిగత డిటెక్టివ్ ద్వారా రహస్యంగా విచారణ జరిపించారు. దర్యాప్తులో బీమా డబ్బు కోసం తన చేతిని తానే నరుక్కుందని వెల్లడైంది. సొమ్ము కొట్టేయాలని బీమా కంపెనీని మోసం చేసినందుకు సదరు మహిళ మీద, తన కుటుంబసభ్యుల మీద ఇన్సూరెన్స్ కంపెనీ చీటింగ్ కేసు వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments