Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు చచ్చాడా.. పీడ విరగడైంది : జహ్రాన్ హషీమ్ సోదరి

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (14:28 IST)
ఈస్టర్ సండే రోజున సృష్టించిన మానరణహోమానికి సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్‌ తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఈ నరహంతకుడు కొలంబోలోని షాంగ్రీలా హోటల్‌లో జరిగిన బాంబు దాడిలో స్వయంగా పాల్గొన్నారు. ఈ ఘటనలో జహ్రాన్ కూడా మరణించాడు. అయితే, ఈ ఘటనలో చనిపోయింది అతనేనా కాదా అన్నది సందేహాస్పందగా మారింది. 
 
ఈ నేపథ్యంలో జహ్రాన్ సోదరి మథానియా ఇంటికి శ్రీలంక సైనిక అధికారి ఒకరు వెళ్లారు. "మీ సోదరుడు జహ్రాన్ మృతదేహం అంపారా ఆసుపత్రిలో ఉంది. మీరు వచ్చి చూస్తే నిర్ధారణ చేసుకుంటాం" అని మథానియాను కోరారు. దాంతో మథానియా "మీరు ఫొటో చూపిస్తే చాలు. అతడో కాదు గుర్తుపడతాను" అని బదులిచ్చింది. 
 
అంతేకాకుండా, "రెండేళ్లుగా అతడితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇస్లాం పేరు చెప్పి తప్పుడు మార్గంలో పయనించాడు. ఖురాన్ చదివినవాడు మంచి మార్గంలో వెళ్లడానికి బదులు అమాయకుల్ని బలితీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జహ్రాన్ 6వ తరగతితో చదువు ఆపేసి ఇస్లామిక్ భావజాలంపై శ్రద్ధ పెట్టాడు. ఇస్లాం మీద ప్రసంగాలు అంటూ విషం చిమ్మేవాడు. ఇప్పుడీ పేలుళ్లలో చచ్చిపోయాడని తెలిసి నిజంగా ఆనందిస్తున్నాను" అంటూ తన హర్షం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments