Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలేదా జియాపై దేశ ద్రోహం కేసు... రేపు అరెస్టు వారెంట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2016 (14:43 IST)
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియాపై దేశద్రోహం కేసు నమోదైంది. బంగ్లా విముక్తి పోరులో వీరమరణం పొందిన సైనికులను కించపరిచేలా కామెంట్లు చేసిన కారణంగానే జియాపై రాజద్రోహం కేసు నమోదైనట్లు ఢాకా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. జియాపై రాజద్రోహం కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి, ఆమె అరెస్టుకు సంబంధించి మంగళవారం అరెస్టు వారెంట్లు జారీ చేయనున్నారని సదరు అధికారి చెప్పారు.
 
పాకిస్థాన్‌పై 1971లో జరిగిన యుద్ధానికి సంబంధించి ఆమె పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం జరిగినపుడు జరిగిన మరణాల సంఖ్యలో తేడాలు ఉన్నాయంటూ గతేడాది డిసెంబర్‌ 21న వ్యాఖ్యానించారు. ఆ యుద్ధానికి సంబంధించి ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నాయని, ఆ వివాదాలపై అనేక పుస్తకాలు, దస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు. ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు ఆ దేశ రాజకీయాలను కుదిపేయనుంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments