Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్ముందు అగ్నిగుండమే... 2027 నాటికి ఉష్ణోగ్రతలో మరింత పెరుగుల

Webdunia
గురువారం, 18 మే 2023 (09:23 IST)
వచ్చే ఐదేళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా భూతాపం మరింతగా పెరిగిపోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్‌) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుందని తెలిపింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు. 
 
అయితే, ఏ ఒక్క ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేక పోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్‌నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక బుధవారం హెచ్చరించింది. 
 
వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం. ఎల్‌నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments