Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట: తాత మృతదేహంతో సెల్ఫీ.. జైలు ఖాయమా?

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (18:12 IST)
సోషల్ మీడియా పుణ్యమా అంటూ యువతకు సెల్ఫీల పిచ్చి ముదిరిపోయింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే సెల్ఫీలు మానవతా విలువల్ని పోగొట్టేలా ఉన్నాయి. ఇది కూడా అటువంటిదే. సౌదీ అరేబియాకు చెందిన ఓ నెట్ ప్రియుడు తన తాత మృతదేహం తీసిన సెల్ఫీ ఫోటోను నెట్‌లో పెట్టాడు. మృతి చెందిన తాతయ్య మృత దేహం వద్ద నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ, సెల్ఫీ తీసుకున్నాడు. ఈ జుగుప్సాకరమైన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
 
అయితే ఈ ఫోటోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. శుభాలకు, అశుభాలకు తేడా లేకుండా.. మానవతా విలువల్ని మంటగలిపేలా ఇలాంటి సెల్ఫీలు తీయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ సెల్ఫీ పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అని ట్యాగ్ కూడా పెట్టాడు. ఈ ఘటనపై సౌదీ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అయ్యగారికి జైలు ఖాయమని వార్తలు వస్తున్నాయి. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments