Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్... ప్రపంచాన్ని కాపాడింది: ఆమెరికా శాస్త్రవేత్త

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:43 IST)
కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని భారత్ చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు. ముఖ్యంగా, భారత్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచానికి ఓ బహుమతి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హాట్జ్ చెప్పుకొచ్చారు. 
 
కొవిడ్‌-19పై ఇటీవల నిర్వహించిన వెబినార్‌లో పీటర్‌ మాట్లాడుతూ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందన్నారు. భారత్‌ భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదన్నారు. 
 
కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ ఔషధ రంగంలో తనకున్న అపార అనుభవం, విజ్ఞానంతో ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని కొనియాడారు. భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రపంచానికి ఒక బహుమతి అన్నారు. 
 
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments