Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్... ప్రపంచాన్ని కాపాడింది: ఆమెరికా శాస్త్రవేత్త

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:43 IST)
కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని భారత్ చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు. ముఖ్యంగా, భారత్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచానికి ఓ బహుమతి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హాట్జ్ చెప్పుకొచ్చారు. 
 
కొవిడ్‌-19పై ఇటీవల నిర్వహించిన వెబినార్‌లో పీటర్‌ మాట్లాడుతూ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందన్నారు. భారత్‌ భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదన్నారు. 
 
కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ ఔషధ రంగంలో తనకున్న అపార అనుభవం, విజ్ఞానంతో ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని కొనియాడారు. భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రపంచానికి ఒక బహుమతి అన్నారు. 
 
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments