Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న భారత్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (10:32 IST)
భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇది బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా, అమెరికాలో ఈ బియ్యం కొరత ఏర్పడటంతో డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. 
 
ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న ఊహగానాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం.
 
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments