ఇంగ్లండ్లో జెట్ విమానం కూలిపోయిన ఘటనలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇంగ్లండ్లో జరిగిన ఈ విమాన ప్రమాదంలో నలుగురు మరణించినట్లు బ్రిటన్లోని హాంప్ షైర్ పోలీస్ సర్వీస్ తెలిపింది. మృతుల్లో ఒసామా బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం. దాంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారని తెలిపింది.
కాగా, ఘటనలో మృతిచెందిన వారు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులని సౌదీ, బ్రిటీష్ మీడియా సంస్థలు అంటున్నాయి. ప్రమాదంపై పోలీసు విభాగం ప్రతినిధి మాట్లాడుతూ... ఘటనలో ఎవరూ బతికి బయటపడలేదని, దురదృష్టవశాత్తూ పైలట్ సహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులు ఎవరన్నది గుర్తించాల్సి ఉండగా, అటు బ్రిటన్లో సౌదీ ఎంబసీ సంతాప ప్రకటన చేసింది.