Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కుండపోత వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (13:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సోమవారం సాయంత్రం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. దీంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు మాత్రం మంగళవారం సెలవు ప్రకటించారు. 
 
మరోవైపు, చెన్నైతో కాంచీపురం, తిరవళ్లూరు, చెంగల్పట్టు, మైలాడుదురై, కడలూరు జిల్లాల్లో బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. 
 
మరోవైపు, వచ్చే రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం మాత్రం అన్ని పాఠశాలలకు మాత్రం సెలవులు ప్రకటించారు. కాలేజీలకు మాత్రం యధావిధిగా పనిచేశాయి. ఇదిలావుంటే, ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడివుంది. 
 
దీనికితోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments