Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కుండపోత వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (13:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సోమవారం సాయంత్రం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. దీంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు మాత్రం మంగళవారం సెలవు ప్రకటించారు. 
 
మరోవైపు, చెన్నైతో కాంచీపురం, తిరవళ్లూరు, చెంగల్పట్టు, మైలాడుదురై, కడలూరు జిల్లాల్లో బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. 
 
మరోవైపు, వచ్చే రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం మాత్రం అన్ని పాఠశాలలకు మాత్రం సెలవులు ప్రకటించారు. కాలేజీలకు మాత్రం యధావిధిగా పనిచేశాయి. ఇదిలావుంటే, ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడివుంది. 
 
దీనికితోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments