Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీస్ శిక్షణా శిబిరంపై దాడి.. 60 మంది హతం

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాక

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:09 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 
 
ఉగ్రవాదులు ముందుగా వాచ్‌ టవర్‌ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తర్వాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే, ఇతర ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments