Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో భారత్‌లో అడుగుపెడతాం.. సౌత్ కొరియా కంపెనీ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:02 IST)
చైనాకు చెందిన 118 యాప్‌ల తొలగింపులో భాగంగా పబ్జీని కూడా ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. తిరిగి భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నట్టుగా తెలిపింది. 
 
తాము పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో అడుగుపెడతామని ధీమాగా చెప్తోంది.  చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది.  
 
వాస్తవానికి పబ్జీ గేమ్‌ను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ తయారు చేసింది. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. దీంతో భారత్‌లో ఈ వర్షన్‌పై నిషేధం విధించారు. ఈ చర్యతో సౌత్ కొరియా కంపెనీ దిగివచ్చింది. 
 
ఇక నుంచి తమ గేమింగ్ యాప్‌తో టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments