Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో జీవించివున్న ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె..?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (12:07 IST)
ఒకపుడు శ్రీలంక దేశాన్ని గడగడలాడించిన ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె ప్రాణాలతో జీవించివున్నట్టు ఓ వీడియో విడుదలైంది. ఇది ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ ఈలం కోరుతూ శ్రీలంకలో జరిపిన అంతర్యుద్ధంలో ఎల్టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్ 2009లో ఆ దేశ సైన్యం చేతిలో హతమైన విషయం తెల్సిందే. అలాగే, ఈ యుద్ధంలో ప్రభాకరన్ భార్య మదివదని, ఇద్దరు కుమారులు, కుమార్తె ద్వారక తదితరులు మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించింది. 
 
అయితే, ప్రభాకరన్ ప్రాణాలతోనే ఉన్నారని పలువురు వివిధ సందర్భాల్లో ప్రకటించినా వాటిని శ్రీలంక సైన్యం ఖండించింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లో ఉంటున్న తారకా హరిధరన్ అనే మహిళ తాను ప్రభాకరన్ భార్య మదివదని సోదరినని చెబుతూ వీడియో విడుదల చేశారు. అందులో మదివదని, ప్రభాకరన్ కుమార్తె ద్వారక బతికే ఉన్నారని పేర్కొనడం సంచలనంగా మారింది. 
 
మరోవైపు శ్రీలంక సామాజిక మాధ్యమాల్లో సైతం ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ దేశంలో సర్వ మక్కల్ కట్చి అనే సంస్థను నిర్వహిస్తున్న ఉదయకళ అనే మహిళనే ప్రభాకరన్ కుమార్తె ద్వారకా అని అందులో పేర్కొన్నారు. ద్వారకా తన పేరుని ఉదయకళగా మార్చుకుని తమిళనాడులో ఆశ్రయం పొంది ప్రస్తుతం శ్రీలంకలో ప్రజాసేవ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments