Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ గర్భిణీ పర్యాటకురాలు మృతి - నైతిక బాధ్యతతో మంత్రి పదవికి రాజీనామా

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (12:57 IST)
రాజకీయ నేతల్లో అతి తక్కువు మంది మాత్రమే నైతిక విలువలకు కట్టుబడివుంటారు. అంతరాత్మ ప్రభోదం మేరకు నడుచుకుంటారు. విధులు నిర్వహిస్తుంటారు. అయితే, పోర్చుగల్ దేశంలో గర్భంతో ఉన్న భారతీయ పర్యాటకురాలు విపత్కర పరిస్థితుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ పర్యాటక మంత్రి ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 
 
ఆ మంత్రి పేరు మార్టా టెమిడో. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లిస్టన్‌లోని ప్రధాన ఆస్పత్రి శాంటియా మారియాలో నియోనాటాలజీ విభాగం కరోనా సమయంలో కిక్కిరిసిపోయింది. దీంతో 34 యేళ్ళ భారతీయ గర్భిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌లో పలు చోట్ల తిప్పారు. 
 
ఆ సమయంలో ఆస్పత్రులన్ని కిక్కిరిసోపియి ఉండటంతో ఆమెను చేర్చేందుకు ఒక్కటంటే ఒక్క పడక కూడా లభించలేదు. ఈ క్రమంలో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఆమె మరణించారన్న వార్త తెలుసుకున్న మంత్రి టెమిడో తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. 
 
 
 
మరోవైపు, ఈ పర్యాటకురాలి మృతిపై పోర్చుగల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కరోనా సమయంలో ఆస్పత్రులోని ప్రసూతి విభాగాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో గర్భిణిలు కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. 
 
ఈ కారణంగానే భారతీయ పర్యాటకురాలిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో మరణించిందని తేలింది. 
 
దీనిపై విపక్ష పార్టీలు ఆరోగ్య మంత్రిపై దుమ్మెత్తి పోశారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
కరోనా సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసూతి సేవలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరోగ్య మంత్రిపై విపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తి పోశారు. దీంతో మంత్రి టెమిడో గర్భిణి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments