Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగింత

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (18:44 IST)
జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగింది. ఇందులో జి-20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకరించారు. అయితే, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ఆయన స్వీకరించారు. జి20 దేశాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమని అభివర్ణించారు. 
 
కాగా, ఈ అధ్యక్ష బాధ్యతలను డిసెంబరు ఒకటో తేదీ 2022 నుంచి డిసెంబరు ఒకటి 2023 వరకు కొనసాగుతారు. వచ్చే యేడాది భారత్‌లోనే ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. బాలిలో జరిగిన జి20 సదస్సులో సభ్య దేశాధినేతలు ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. వచ్చే భారత్‌లో జరిగే జి20 దేశాల సదస్సును వివిధ నగరాల్లో నిర్వహించేలా చూస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments