Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో ఆగని వరుస భూకంపాలు - వేలాది మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (20:27 IST)
టర్కీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం 7.8 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రాన్ని సెంట్రల్ టర్కీలో గుర్తించారు. 
 
ఆ తర్వాత 12 గంటల వ్యవధిలో మరో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 1600మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. శిథిలాల కింద నుంచి ఇంకా వెలికితీత కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో టర్కీ, సిరియా దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 
 
మరోవైపు, ఈ వరుస భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. మోడీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments