Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో ఆగని వరుస భూకంపాలు - వేలాది మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (20:27 IST)
టర్కీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం 7.8 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రాన్ని సెంట్రల్ టర్కీలో గుర్తించారు. 
 
ఆ తర్వాత 12 గంటల వ్యవధిలో మరో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 1600మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. శిథిలాల కింద నుంచి ఇంకా వెలికితీత కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో టర్కీ, సిరియా దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 
 
మరోవైపు, ఈ వరుస భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. మోడీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments