ప్రధాని మోడీకి అరుదైన గౌవరం..."ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా"

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (10:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. పశ్చిమాఫ్రికా దేశమైన ఘనా తమ దేశ అత్యున్నత పురస్కారమైన "ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా"ను ప్రకటించింది. నరేంద్ర మోడీ విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రపంచ వ్యాప్తంగా ఆయన చూపిస్తున్న ప్రభావంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తునట్టు ఘనా పాలకులు ప్రకటించారు. 
 
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనా చేరుకున్న ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ఆ పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవం పట్ల ప్రధాని మోడీ కృతజ్ఞలు తెలిపారు. ఈ పురస్కారం తన వ్యక్తిగతం కాదని, 140 కోట్ల మంది భారత ప్రజల తరపున దీనిని స్వీకరిస్తున్నట్టు ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని దేశ యువతకు భారత గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, భారత్ - ఘనా దేశాల మధ్య ఉన్న చిరకాల మైత్రికి అంకితమిస్తున్నట్టు తెలిపారు.
 
అంతకుముందు ఇరు దేశాల నేతల మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మూడు దశాబాద్దాల సుధీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనా దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాశిఖన్నాకు దశ తిరిగిందిగా.. నాలుగు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో సంతకం చేసేసిందిగా!

Rukmini Vasanth: రష్మిక మందన్న స్థానాన్ని ఫిల్ చేసిన కాంతారా హీరోయిన్ రుక్మిణి?

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత.. నిర్మాతగా న్యూ లైఫ్

హిందీ చిత్ర నిర్మాణంపై దిల్ రాజు చూపు.. సల్మాన్ ఖాన్‌తో చిత్రం?

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments