Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చాలి : హైకోర్టులో పిటిషన్

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (16:45 IST)
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షను ఎదుర్కొని పదవీచ్యుతుడైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ దేశం విడిచి వెళ్లిపోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇమ్రాన్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. దీంతో పాక్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగాయి. 
 
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని వీడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ జాబితాలో పేరు చేరితే ఆ వ్యక్తులు దేశాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదు. తప్పనిసరిగా విచారణను ఎదుర్కోవాల్సివుంటుంది. 
 
మరోవైపు, పీఎంఎల్ ఎన్ పార్టీ ప్రధాని అభ్యర్థి షాబాజ్ షరీప్ స్పందిస్తూ, తాము కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. అలాగే, ఎవరినీ అరెస్టు చేయమని చెప్పారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలావుంటే, అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపై చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments