Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై పందులు దాడి... మృతి... పందులకు మరణ శిక్ష

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (13:18 IST)
తప్పు చేస్తే... అది హత్యలు వంటి వాటికి పాల్పడితే మనుషులకు మరణ దండనలు విధించడం మనకు తెలిసిన విషయమే. 15వ శతాబ్దంలో తప్పు చేసిన జంతువులను కూడా శిక్షించేవారని పరిశోధకులు పేర్కొంటున్నారు. అప్పట్లో ఫ్రాన్స్ దేశంలో జంతువులను కూడా మనుషుల్లానే భావించి నేరం చేసిన జంతువులను బంధించి విచారించి శిక్ష విధించి అమలు జరిపేవారట.
 
దీనికి ఓ ఉదాహరణను కూడా ఉటంకించారు. అదేమిటంటే... ఫ్రాన్స్ లోని సావిగ్నీ అనే గ్రామంలో ఆరు పందులు ఐదేళ్ల బాలుడిపై దాడిచేసి అతడి మృతికి కారణమయ్యాయి. ఈ దుర్ఘటన తెలుసుకున్న భద్రతా సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
 
బాలుడి మృతికి ఆ ఆరు పందులు కారణమని నేరం నిర్థారణ కావడంతో వాటికి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు వాటికి మరణ దండన విధించారు. ఇలాంటి మరణ శిక్షలు కేవలం పందులకే కాదు... అప్పట్లో కుక్కలు, ఏనుగులు... ఇతర జంతువులకు నేర స్థాయిని బట్టి శిక్షలు విధించేవారట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments