Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ సరిగా పెట్టలేదని పనిమనిషితో బ్లీచింగ్ నీళ్లు తాగించిన యజమాని... ఎక్కడ?

పొట్టకూటి కోసం విదేశాలకు వెళుతున్న అనేక మంది పేదలు చిత్రహింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, కంపెనీ యజమానులతో పాటు ఇంటి యజమానులు పెట్టే చిత్ర హింసలు భరించలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (12:31 IST)
పొట్టకూటి కోసం విదేశాలకు వెళుతున్న అనేక మంది పేదలు చిత్రహింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, కంపెనీ యజమానులతో పాటు ఇంటి యజమానులు పెట్టే చిత్ర హింసలు భరించలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా టీ సరిగా పెట్టలేదన్న అక్కసుతో ఓ పని మనిషితో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగించాడో ఓ ఇంటి యజమాని. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫిలిప్పైన్స్‌కు చెందిన అగ్నస్ మన్సిల్లా అనే ఓ మహిళ బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని సౌదీఅరేబియాకు వెళ్లి, అక్కడ ఓ ఇంటిలో పని  మనిషిగా చేరింది. ఆ తర్వాత ఆమె దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టీ సరిగా పెట్టకపోవడంతో ఇంటి యజమాని హెచ్చరించాడు. ఆ తర్వాత అదే తప్పు పదేపదే చేస్తున్నావంటూ యజమాని ఆగ్రహించాడు. 
 
వెంటనే పనిమనిషితో బలవంతంగా బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగించగ ఆమె సృహతప్పిపడిపోయింది. దీంతో భయపడిన నిందితుడు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేరం రుజువైతే నిందితుడు శిక్షను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. జరిమానా, జైలుశిక్షతోపాటు కొరఢా దెబ్బలు కూడా కొట్టే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments