Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (11:11 IST)
పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ ఏకాకిగా మారుతోందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజాన్ని దౌత్యపరంగా మోదీ తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నారని ముషారఫ్ అన్నారు. 
 
నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తున్న నేపథ్యంలో.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ముషారఫ్ ప్రశ్నించారు. లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవలన ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని.. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments