Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెషావర్ దాడులకు భారతే కారణం: పర్వేజ్ ముషారఫ్ ఆరోపణ

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (11:03 IST)
పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడుల అనంతరం భారత్ అందించిన మద్దతును పాకిస్థాన్ నేతలు ప్రశంసిస్తుంటే, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ మాత్రం దాడులకు భారతదేశమే కారణమంటున్నారు. 
 
తెహ్రీక్-ఏ-తాలిబన్ కమాండర్ మౌలానా ఫజులుల్లా ఓ ఆఫ్ఘన్ జాతీయుడని, అతడికి శిక్షణ ఇచ్చింది భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని ఆరోపించారు. చిన్నారులను చంపిన తాలిబన్లకు శిక్షణ ఇచ్చిందే భారతేనని ఉద్ఘాటించారు. పాకిస్థాన్ వ్యాప్తంగా దాడులు చేసేందుకు భారత్, ఆఫ్ఘన్ దేశాలు తాలిబన్ కమాండర్‌కు సహకరిస్తున్నాయని అన్నారు. 
 
భారత్‌పై విషం కక్కే జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ కూడా పెషావర్ దాడులకు భారత్‌నే వేలెత్తి చూపిస్తున్నాడు. సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి వెనుక భారత్ హస్తం ఉందన్నాడు.
 
అంతేగాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలకు దన్నుగా భారత్ తన బలగాలను పంపితే, కాశ్మీర్‌లోని తమ సహోదరులకు సాయపడేందుకు ముజాహిదిన్‌లు ముందుకు కదులుతారని హెచ్చరించారు. సాయం కోసం కాశ్మీరీలు ఎలుగెత్తుతున్నారని, వారికి సాయపడడం తమ ధర్మం అని హఫీజ్ పేర్కొన్నాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments