Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ: 30మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:41 IST)
Train
పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి - దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌, సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును.. మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు. 
 
సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత ఆ రూట్‌లో నడిచే రైళ్లను నిలిపి వేసినట్లు అబ్దుల్లా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments