Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం - 39 మంది వలసదారుల మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:56 IST)
అమెరికాలోని పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో ఏకంగా 39 మంది వలసదారులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 66 మంది ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో ఏడుగురు పారిపోయారు. 
 
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని శరణార్థులుగా గుర్తించి ప్రత్యేక శిబిరాలకు తరలిస్తుంటారు. ఆ విధంగానే 66 మంది శరణార్థులను ఒక బస్సులో తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులోని 39 మంది వలసదారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘాట్‌ రోడ్డులో వెళుతుండగా బస్సు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల కొలంబియా నుంచి 66 మంది వలసదారులు అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వీరందరినీ సరిహద్దు వద్ద విధుల్లో ఉండే సైనికులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారందరినీ గౌలాకా శరణార్థ శిబిరానికి తరలిస్తుండగా ఘాట్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించేక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడుగురు వలసదారులు పారిపోయారు. వారికోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments