Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం పరువు తీశావంటూ దౌత్యవేత్తపై పాకిస్థానీల తిట్లదండకం...

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె చూపిన అత్యుత్సాహంతో ఆమె అభాసుపాలైంది.

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:15 IST)
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె చూపిన అత్యుత్సాహంతో ఆమె అభాసుపాలైంది. గాజాలో గాయపడిన ఓ యువతి చిత్రాన్ని చూపుతూ, ఆమె కాశ్మీర్‌లో మహిళల పరిస్థితి ఇదని ప్రకటించి అభాసుపాలుకాగా, దేశం పరువు తీశావంటూ, పాక్ దేశవాసులు ఆమెపై తిట్ల దండకానికి దిగారు. వెంటనే ఆమెను దౌత్యాధికారి పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లూ ఊపందుకున్నాయి. 
 
ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడిన రవయ అబు జోమా అనే యువతి ఫోటోను 2014లో హీదీ లెవిన్ అనే ఫోటోగ్రాఫర్ తీయగా, దీనికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన పాక్ దౌత్యవేత్త మలీహా, అదే ఫోటో ప్రింట్‌ను ఐరాసలో చూపిస్తూ, కాశ్మీర్‌లో యువతులపై భారత సైన్యం అకృత్యాలు జరుపుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో విమర్శలు చేసింది. ఆమె ప్రసంగం ముగిసేలోపే ఈ ఫోటో కాశ్మీర్ యువతిది కాదని నెటిజన్లు తేల్చేశారు. 
 
దీనిపై పాకిస్థాన్ పౌరులతో పాటు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక దేశానికి ఐరాసలో ప్రతినిధిగా ఉన్న లోధీ.. అంతర్జాతీయ అంశాలపై ఏమాత్రం అవగాహనలేదని ఈ ఫోటోతో తేలిపోయిందంటున్నారు. పైగా, ఆమె చేసిన పని కారణంగా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ పరువు పోయిందని, తమ దేశం చెప్పే అన్ని అంశాలూ ఇలాగే అసత్యాలని నమ్మే పరిస్థితులు వచ్చాయని ఆ దేశ వాసులు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నో అవార్డులు అందుకున్న మూడేళ్ల నాటి ఫోటోను గుర్తించలేకపోయిన ఆమె, తాను ఓ దేశానికి ప్రతినిధినన్న విషయాన్ని మరచి చౌకబారు ప్రసంగం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments