Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మేరా దోస్త్.. స్నేహాస్తం సాచిన నవాజ్ షరీఫ్!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (17:43 IST)
భారత్ తమ దాయాది నేస్తమంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ స్నేహాస్తం సాచారు. తాము ఒక్క భారత్‌తోనే కాకుండా సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటితో మంచి సంబంధాలు కోరుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు.
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూఢిల్లీ పర్యటన తర్వాత శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడటాన్ని ఆ రెండు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.
 
ఈ నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్ వెళ్లి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ముఖ్యమైన పొరుగు దేశమంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
 
ఇందులో ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థితిని షరీఫ్‌కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల మధ్య జమ్మూకాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించినట్టు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments