Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ రైలు ప్రమాదం: 65కి చేరిన మృతుల సంఖ్య

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:51 IST)
పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 65కి పెరిగింది. కరాచి - రావల్పిండి వెళుతున్న తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మూడు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. లియాకత్‌పూర్‌ నగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 65 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది మృతదేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. 
 
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన వద్దనున్న గ్యాస్ సిలెండర్‌ను వెలిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments