Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అవామీ నేషనల్ పార్టీ అధికారిక సమావేశంల

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (11:37 IST)
పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అవామీ నేషనల్ పార్టీ అధికారిక సమావేశంలో చేసిన సూచన సంచలనం రేపింది. 
 
దేశంలో మద్యం తాగిన సాధారణ పాక్ పౌరులకు ఆరునెలలు, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తుండగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటేరియన్లకు ఉరిశిక్ష లేదా మరణదండన ఎందుకు విధించకూడదని షాహీ సయ్యద్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. 
 
గంజాయి తాగే వారిపై మాట్లాడుతూ గంజాయి, దార్వేష్ అనే మత్తు పానీయం, నల్లమందులపై కూడా దేశంలో నిషేధం విధించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకులు ఎవరైనా మద్యం, గంజాయి, నల్లమందు తీసుకుంటున్నట్లయితే అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రకటించాలని సెనేట్ సమావేశానికి అధ్యక్షత వహించిన మరో సెనేటర్ రహమాన్ మాలిక్ చెప్పారు. 
 
దేశంలో హిందూ పేరుతో ముస్లిమ్ వ్యక్తి మద్యం విక్రయించడం విచారకరమని సయ్యద్ పేర్కొన్నారు. పాకిస్థాన్ దేశంలో మద్యం తాగడం, విక్రయించడంపై నిషేధం విధించినా, ఇతర మతాల వారి కోసం లైసెన్సుడ్ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. మొత్తంమీద పాక్ సెనేటర్లు మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణదండన విధించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments