Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రరిస్టులపై పాక్ ఉక్కుపాదం : ఒక్క ఇస్లామాబాద్‌లోనే 300 మంది అరెస్టు!!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (17:40 IST)
తనదాకా వస్తేకానీ తెలియదన్న సామెతను నిజం చేస్తూ పెషావర్ దాడి తర్వాత పాకిస్థాన్ భద్రతాల బలగాలు తీవ్రవాదులపై విరుచుకుపడుతున్నాయి. పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత పాక్ సైనిక బలగాలతో పాటు ఆ దేశ ప్రభుత్వం కూడా మొద్దు నిద్రను వీడింది. 
 
పెషావర్ దాడి జరిగి 48 గంటలు తిరగకముందే జైళ్ళలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని ఆ దేశ సైనిక చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫైసలాబాద్‌లో నలుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేసింది. అలాగే, తీవ్రవాదులపై పగబట్టేశాయా అనే రీతిలో దేశవ్యాపంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజులోనే ఇస్లామాబాద్ చేపట్టిన గాలింపు చర్యల్లో తీవ్రవాద అనుమానిత వ్యక్తులుగా భావిస్తున్న 300 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 
 
దీంతో పాకిస్థాన్ భద్రతా బలగాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్‌లో తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని, ఏ చిన్న వేరును మిగిల్చినా, అది ఆ దేశ భద్రతా బలగాలకు పెను సవాలు విసురుతుందని హెచ్చరిస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments