Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్ జరగనేలేదు.. భారత్ మాత్రం పాడిందే పాడుతోంది: పాకిస్థాన్

భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని చెప్తోంది. కానీ భారత్ మాత్రం అరిగిపోయిన రికార్డులా అదే పాట పదేపదే పాడుతుందని పాకిస్థాన్ మండిపడింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ కా

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (11:01 IST)
భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని చెప్తోంది. కానీ భారత్ మాత్రం అరిగిపోయిన రికార్డులా అదే పాట పదేపదే పాడుతుందని పాకిస్థాన్ మండిపడింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత భద్రతా దళాలు పాకిస్థాన్‌లో విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయని.. ఈ విషయాన్ని ముందు పాకిస్థాన్‌కే చెప్పామని.. తర్వాతే భారత మీడియాకు తెలిపామని మోదీ అన్నారు. అంతేగాకుండా పాకిస్థాన్ ఉగ్రవాదుల ఎగుమతి చేస్తోందని ఆరోపించారు.
 
అయితే మోదీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమ దేశంపై అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని పేర్కొంది. భారత్ మాటలు బూటకమని కొట్టిపడేసింది. జరగని విషయాన్ని జరిగినట్లు భారత్ పదేపదే చెప్తోందని విమర్శలు గుప్పించింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని భారత్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. 
 
ఇదిలా ఉంటే.. గత డిసెంబర్‌‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న నగరాలను హస్తగతం చేసుకున్న తరువాత, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇరాక్ న్యాయస్థానాలు పలువురికి కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఐఎస్ఐఎస్‌లో చేరి, ఉగ్రవాదులుగా మారిన వారితో పాటు, వారి కార్యకలాపాలకు సహకరించిన వారందర్నీ ఇరాక్ లోని సంకీర్ణ సేనలు అదుపులోకి తీసుకోగా, వారిలో సుమారు 300 మందికి న్యాయస్థానాలు మరణశిక్షను ఖరారు చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments