Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఇళ్లపై కూలిన విమానం : 107 మంది దుర్మరణం

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:22 IST)
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 107 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి కరాచీలో జిన్నా అంతర్జాతీయ విమానశ్రయం వద్ద ఎయిర్‌పోర్టుకు 4 కిలోమీటర్ల సమీపంలో కుప్పకూలిపోయింది. 
 
ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 100 మంది ప్రయాణికులతో పాటు.. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ విమానం జిన్నా విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి.. విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలోనే కుప్పకూలిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ విమాన ప్రమాదం జనావాసాల్లో జరగడంతో అనేక గృహాలు కూడా ధ్వసంమయ్యాయి. అయితే, ఈ గృహాల్లోని ప్రజల సంగతి తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments