Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్‌ విడుదలపై అమెరికా ఆందోళన... పాక్‌కు వార్నింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షం

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (13:07 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. హఫీజ్ చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకొని మళ్లీ అరెస్టుచేయాలని కోరింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
'లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అగ్రనేత పాకిస్థాన్‌లో గృహనిర్బంధం నుంచి విడుదల కావడంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. సయీద్‌ ఆధ్వర్యంలోని ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోనే అనేకచోట్ల మారణహోమం సృష్టించి అమెరికా సహా అనేకచోట్ల అమాయకుల్ని బలితీసుకున్నాయి. అందువల్ల పాకిస్థాన్ అతడిని మళ్లీ అరెస్టుచేయాలి' అని ఆ కార్యాలయ ప్రతినిధి హ్యాథర్‌ న్యూరెట్‌ డిమాండ్‌ చేశారు.
 
ముంబై దాడుల సూత్రధారి అయిన సయీద్‌ను జనవరి 31 నుంచి పాక్‌ నిర్బంధంలో ఉంచింది. నవంబర్‌ 23వ తేదీతో అతడి నిర్బంధ గడువు ముగియడంతో అతడిని శుక్రవారం అర్థరాత్రి విడుదలచేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సయీద్‌ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments